హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): మొబైల్ యాప్ల ద్వారా అధిక వడ్డీకి రుణాలిచ్చి కస్టమర్లను వేధించిన కుడోస్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. ఆ కంపెనీకి చెందిన పలు బ్యాంకు ఖాతాలు, పేమెంట్ గేట్వే అకౌంట్లలోని రూ.72,32,42,045 సొమ్మును జప్తు చేసినట్టు ఈడీ బుధవారం వెల్లడించింది. కస్టమర్ల వ్యక్తిగత డాటాను దుర్వినియోగం చేయడంతోపాటు వారిపై వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుడోస్పై తెలంగాణ పోలీసులు ఇప్పటికే పలుచోట్ల కేసులు నమోదు చేయడంతోపాటు ఆ కంపెనీ డైరెక్టర్, సీఈవో పవిత్ర ప్రదీప్ వాల్వేకర్ను అరెస్టు చేశారు. ఈ కేసులతోపాటు మనీ లాండరింగ్ వ్యవహారంలో కుడోస్పై దర్యాప్తు కొనసాగుతున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.