గ్రామీణాభివృద్ధిశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 25 మందికి తగ్గకుండా 100 శాతం పనులు కల్పించాలని గ్రామీణాభివృద్ధిశాఖ.. అధికారులను ఆదేశించింది. వ్యవసాయ, ఇతర పనులు పెరగడంతో ఉపాధి హామీ పనులకు కూలీల రాక తగ్గిపోయింది. ఇటీవల నిర్వహించిన సమీక్షలో ప్రతి పంచాయతీలో సగటున 10 మంది కూలీలే పనులకు హాజరవుతున్నట్టు తేలింది. ఈ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా కూలీల హాజరును పెంచడం, పనులను గుర్తించడంపై తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ఆ వివరాలు ఇలా..