రాజాపేట, నవంబర్ 19 : నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ సంస్థ పెండింగ్ పాల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి పాల కేంద్రం వద్ద రైతులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ..
ఇప్పటికే 8 పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో పశు పోషణతోపాటు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్ బిల్లులు సత్వరమే చెల్లించకపోతే మదర్ డెయిరీపై పాడి రైతులు విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు.