హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చోరీకి గురైన, పోయిన ఫోన్లను గుర్తించి వాటిని యజమానులకు అందించడంలో మన పోలీసులు సఫలీకృతులవుతున్నారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) విధానంతో 3 నెలల్లోనే 3,684 ఫోన్లను యజమానులకు అప్పగించారు. దేశవ్యాప్తంగా ఈ సరికొత్త విధానం ద్వారా జూలై 17 వరకు 2,81,951 ఫోన్లు ఎక్కడున్నయో ట్రేస్ చేశారు.