హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన తెలంగాణ హాకీ చైర్మన్ కొండా విజయ్కుమార్ను ఢిల్లీ ఐటీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హాకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి బయలుదేరిన విజయ్కుమార్ను హైదరాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఒంటిపై భారీగా బంగారు ఆభరణాలు ఉండటంతోనే అతన్ని అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది.
విజయ్కుమార్ న్యూఢిల్లీ ఎయిర్పోర్టులో దిగగానే ఢిల్లీ ఐటీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలిసింది. అతని ఒంటిపై ఉన్న బంగారం మొత్తాన్ని సీజ్ చేయడంతోపాటు స్థిర, చరాస్తుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. 12 గంటలపాటు విచారించిన అధికారులు అవార్డుల ప్రదానోత్సవానికి వెళ్లడానికి అనుమతినిచ్చారు. అనంతరం మళ్లీ విచారణకు హాజరు కావాలని అతన్ని ఆదేశించారు.