నిజామాబాద్: నిజామబాద్ జిల్లా బోధన్లో (Bodhan) దారుణం జరిగింది. హాస్ట్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో డిగ్రీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారి తండాకు చెందిన వెంకట్ బోధన్లోని బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. ఓ విషయమై హాస్టల్లోని విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇంటర్ విద్యార్థులు వెంకట్ను హత్యచేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.