బీజేపీ నాయకులపై కేసు నమోదు
జీడిమెట్ల, మే 29: ఫేస్బుక్, సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు, బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు ఆదివారం సాయంత్రం జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదుచేశారు.
హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రసూననగర్కు చెందిన ఎం రాజేశ్ అనే వ్యక్తి ఆదివారం ఫేస్బుక్ ఖాతాలో మంత్రి కేటీఆర్ను కించపరిచేవిధంగా ఫొటోలు, వ్యాఖ్యలు పెట్టడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.