హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫలితాల్లో సర్కారు జూనియర్ కాలేజీలు డీలాపడ్డాయి. ఫస్టియర్, సెకండియర్లోనూ గతేడాదితో పొల్చితే ఫలితాలు పడిపోయాయి. ఈ ఏడాది ఫస్టియర్లో 38.21%, సెకండియర్లో 49.13% ఉత్తీర్ణత నమోదైంది. నిరుడు ఫస్టియర్లో 40% , సెకండియర్లో 54శాతం ఉత్తీర్ణత నమోదైంది. జనరల్ గురుకుల సొసైటీలో 35 కాలేజీలుండగా, ఫస్టియర్లో 86.84% , సెకండియర్లో 92.53% విద్యార్థులు పాసయ్యారు.