హైదరాబాద్ : మోసం చేయడం,వెన్నుపోట్లు పొడవడం పార్టీలు మారే ఎమ్మెల్యే కడియం శ్రీవారికి బాగా అలవాటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLA Palla Rajeshwar Reddy ) ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కడియం శ్రీహరి( Kadiam Srihari ) ఏ కులానికి చెందినవాడు.? ఏ సామజికవర్గానికి చెందినవాడంటూ గతంలో ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కడియంను ముఖ్యమంత్రి పొగడ్తలతో ముంచెత్తుతున్నాడని విమర్శించారు. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని, బీఆర్ఎస్ సభ్యుడివైతే, సిగ్గు ఉంటే బీఆర్ఎస్ సీట్లో వచ్చి కూర్చోవాలని హితవు పలికారు.
ముఖ్యమంత్రికి రెండు నాలుకలు కాదు నాలుగు నాలుకలతో ఇష్టమున్నట్లు మాట్లాడుతు న్నారని విమర్శించారు. కడియం శ్రీహరి గురించి మాట్లాడడం దండగ అని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన తప్పులను గమనించిన సీఎం ఆయన మంత్రి పదవి తొలగింపు తప్పదనే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనని మాటలను ఆపాదిస్తూ అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు దుమారం రేపారని పేర్కొన్నారు. డబ్బులు, పదవుల కోసం కడియం ఎంతటి దిగజారుడుతనానికైనా దిగుతారని విమర్శించారు.