ఆదిలాబాద్ : అదిలాబాద్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ విధానాలు నచ్చక ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ టికెట్ను కంది శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వడాన్ని నిరసిస్తూ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్( Sajid Khan), టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకుడు సంజీవరెడ్డి పార్టీ సభ్యత్వానికి తమ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి డబ్బున్న వారికి టికెట్లు కేటాయించిందని నాయకులు మండిపడ్డారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కాకుండా ఇతర పార్టీ నుంచి వలస వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారన్నారు. అధిష్ఠానం తమ ప్రతిపాదనలు పక్కకు పెట్టి టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి రామచంద్ర రెడ్డి మేనల్లుడు సంజీవరెడ్డిని పోటీలో నిలుపుతామని నాయకులు స్పష్టం చేశారు.