సింగరేణి కేసులో హైకోర్టు తీర్పు
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): కారుణ్య నియామాలకు అవివాహిత అయిన సోదరి కూడా అర్హురాలే అని హైకోర్టు తీర్పు వెలువరించింది. సింగరేణి కాలరీస్లో కారుణ్య నియామకం కింద సోదరి కూడా అర్హురాలేనని స్పష్టం చేసింది. సింగరేణిలో పనిచేసే సోదరుడు మరణించడంతో కారుణ్య నియమాకం కోసం అతని సోదరి కే శ్రీవాణి దరఖాస్తు చేసుకున్నారు.
ఆ దరఖాస్తును పెద్దపల్లి జిల్లా గోదావరిఖని-1 ఇంక్లెయిన్ తిరసరించడాన్ని ఆమె హైకోర్టులో సవాలు చేశారు. పిటిషనర్ కూడా తగిన పోస్టుకు అర్హురాలేనని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. అవివాహిత సోదరి కూడా కారుణ్య నియామకానికి అర్హురాలంటూ జార్ఖండ్ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వ్యాజ్యంపై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు.