హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీ దగ్గరపడుతున్నది. పరీక్ష ముగింట్లో కొత్త అంశాల జోలికి వెళ్లకుండా, ఇప్పటి వరకు చదువుకొన్న వాటినే రివిజన్ చేసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు గ్రూప్-1 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్. ఈ నెల 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్షార్థులకు ఆయన పలు సూచనలు చేశారు.