సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ సురేపల్లి సుజాత దసరా పండుగను పురస్కరించుకొని సమకూర్చిన దుస్తులను మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పంపిణీ చేశారు. నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ జగదీశ్ పాల్గొన్నారు. – తాడ్వాయి