హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ, డయేరియా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్, తలసేమియా, రక్తహీనత, క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. మొబైల్ యూనిట్ల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు విస్తరించడంతోపాటు నోటిఫికేషన్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.