మంచిర్యాల : దళితుల అభ్యున్నతికే దళిత బంధు పథకం అని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 74 మంది లబ్ధిదారులకు వివిధ రకాల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప..దళితబంధుతో వారి జీవితాల్లో వెలుగులు ప్రసరించనున్నాయని ఆయన తెలిపారు. దళితుల అభివృద్ధికి పాటుపడుతున్న అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రపంచమేధావి, బాబా సాహెబ్ అచరణలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.