మోతె, ఆగస్టు 14: దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తూ సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం, సర్వారం గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు శనివారం సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు మాట్లాడుతూ దళిత బంధు పథకం కింద ఒక్కో నిరుపేద కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం హర్షణీయమన్నారు.