హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ‘సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న దళితబంధు సత్ఫలితాలను ఇవ్వడం మొదలు పెట్టింది.
సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అట్టడుగున ఉన్న నిరుపేదలను అభ్యున్నతి వైపు తీసుకెళ్లడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని మంత్రి కేటీఆర్ పోస్టుచేశారు.