నీలగిరి, డిసెంబర్ 21: దళితబంధు పథకం యూనిట్లకు నిధులు విడుదల చేసి గ్రౌండింగ్ చేపట్టాలని దళితబంధు సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని అంబేదర్ విగ్రహం వద్ద సాధన కమిటీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితబంధు రెండో విడత కోసం నల్లగొండ నియోజకవర్గంలో 1,055 మంది కోసం ఎస్సీ కార్పొరేషన్కు నిధులు వచ్చినట్టు పేర్కొన్నారు.
గ్రౌండింగ్ పూర్తి చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఎన్నికల కోడ్తో నిలిచిపోయిందన్నారు. కోడ్ ముగిసినా ఇప్పటివరకు గ్రౌండింగ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధు ఇవ్వకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో కమిటీ నాయకులు పాలడుగు నాగార్జున, బకరం శ్రీనివాస్, కంచనపల్లి విమలమ్మ, అద్దంకి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.