హైదరాబాద్, మార్చి 30 : ప్రభుత్వ దవాఖానల్లో శానిటరీ, ఫుడ్, సెక్యూరిటీ తదితర సేవలందించే ఏజెన్సీ ల్లో దళితులకు 16 శాతం రిజర్వేషన్ కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మొత్తం 222 ప్రభుత్వ దవాఖానల్లో దళితులకు 28 కేటాయించారు.
రిజర్వేషన్లపై సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం తీసుకొంటున్న చర్యలు దళితుల సమగ్రాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని బుధవారం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.