MP Aravind | మల్లాపూర్, అక్టోబర్ 14: ఎంపీ అర్వింద్ మెట్పల్లిలో జరిగిన సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేయడంతోపాటు, ఎమ్మెల్యేపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించడాన్ని నిరసిస్తూ శనివారం మల్లాపూర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రజల్లో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే, ఆయన తనయుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లపై ఎంపీ అర్వింద్ ఇష్టానుసారంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇటీవల నియోజకవర్గంలో దళితబంధు ద్వారా వంద మందికిపైగా లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి దళితుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే కృషి చేశారని అన్నారు. దళితబంధు పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు అర్వంద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.