దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో వేగం పెంచండి
పథకం పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించండి
అధికారుల సమీక్షలో మంత్రులు హరీశ్, కొప్పుల
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : దళితబంధు లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలని మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. మార్చి నెలాఖరునాటికి లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చే యాలని సూచించారు. గురువారం అరణ్యభవన్లో ఎస్సీ కులాల అభివృద్ధి, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమశాఖలపై మంత్రులు స మీక్ష నిర్వహించారు. దళిత కుటుంబాలను వర్తక, వ్యాపారరంగంలోకి తీసుకొచ్చి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ దళితబంధును చిత్తశుద్ధితో అమలుచేస్తున్న విషయాన్ని అధికారు లు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. పథకం అమలు, పురోగతిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించాలని చెప్పారు. తొలిదశలో లబ్ధిదారులు చేపట్టే వ్యాపార కార్యకలాపాలపై అధికారులు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమైనట్టు చెప్పారు. కార్యక్రమంలో వక్ఫ్బోర్డు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లు మహమ్మద్ సలీం, బండా శ్రీనివాస్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి రాహూల్ బొజ్జా, అధికారులు యోగితారాణా, అహ్మద్నదీమ్, రొనాల్డ్ రోస్, దివ్యదేవరాజన్, శ్రీదేవి, షానవాజ్ ఖాసీం, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.