హుజురాబాద్ :మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ లో జరిగే దళిత బంధు సభకు సనత్ నగర్ నియోజకవర్గ దళితులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆర్థిక సాధికారతతో వారి అభ్యున్నతి కోసం కృషి చేసేందుకు ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దళిత బంధుపథకం ద్వారా దళితులకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించనున్నది. దళిత బంధు పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.