వనపర్తి, జనవరి 24 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం మార్చిలోగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి దళితబంధుతోపాటు వివిధ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు. నియోజకవర్గం నుంచి 100 మంది లబ్ధిదారులను త్వరగా గుర్తించాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఒక్కో వార్డుకు ఒక్కరి చొప్పున 6 లేదా 7 కుటుంబాలను ఎంపిక చేయాలని చెప్పారు. అభివృద్ధి పథకాల పనుల్లో ఎలాంటి జాప్యం జరుగకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ అపూర్వరావు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.