Balagam Mogilaiah | దుగ్గొండి, మే 3: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతోపాటు కుటుంబ విలువలను బలగం సినిమాలో కండ్లకు కట్టినట్టు చూపించిన మొగిలయ్య కుటుంబానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి బుధవారం దళితబంధు పథకం యూనిట్ మం జూరు చేశారు. మొగిలయ్య కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్లోని నిమ్స్లో చేరిన విషయం తెలిసిందే.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెం దిన మొగిలయ్య దంపతుల ప్రతిభ ఎంతో గొప్పదని ఎమ్మెల్యే కొనియాడారు. మొగిలయ్య ఆరోగ్యం బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి మొగిలయ్య కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.