పెద్దపల్లి, జనవరి 5: కేసీఆర్ సర్కార్ మంజూరు చేసిన దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు కన్నూరి శ్రీశైలం ఆధ్యర్యంలో లబ్ధిదారులు శుక్రవారం కలెక్టర్కు తమ గోడువెల్లబోసుకున్నారు. మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాలకు చెందిన పలువురు దళితులను రెండో విడత దళితబంధు పథకం కింద ఎంపిక చేశారని వారు తెలిపారు.
ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల నుంచి వాటికి సంబంధించిన అన్ని పత్రాలు తీసుకొని పరిశీలన చేసి దళితబంధు పోర్టల్లో పేర్లను నమోదు చేశారని, బ్యాంకులో కూడా దళితబంధు జీరో అకౌంట్ తీయించారని గుర్తు చేశారు. మంజూరైన నిధులు అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కలెక్టర్ అకౌంట్లో రూ.26.45 కోట్లు జమ చేశారని, ఆ నిధులను విడుదల చేసి తమను ఆదుకోవాలని వారు కోరా రు. తర్వాత కలెక్టర్ సూచన మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం కన్నూరి శ్రీశైలం మీడియా తో మాట్లాడుతూ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చొరవ తీసుకొని నిధులు మం జూరయ్యేలా చూడాలని కోరారు.