వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సైక్లోథాన్ వరంగల్ 2022 పోటీలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, సీపీ తరుణ్ జోషి సైకిల్ తొక్కారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు సామాన్యుడి వాహనం సైకిల్ అని గుర్తు చేశారు. సైక్లింగ్ మంచి ఆరోగ్యకరమైన అలవాటు అని అన్నారు. సైక్లింగ్తో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయన్నారు. ఇప్పటికీ చైనా లాంటి దేశాల్లో సైకిల్ను విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు. సైక్లింగ్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు, పాల్గొంటున్న వారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు.