షార్జా నుంచి శుక్రవారం హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు పేస్టు రూపంలో బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తుండగా ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్యాంట్ అంతర్భాగంలో పేస్టు రూపంలో 234.05 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ రూ.11.54 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడిని అరెస్టుచేసి విచారణ జరుపుతున్నారు. – శంషాబాద్