హైదరాబాద్: హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టుబడింది. జడ్డా నుంచి శంషాబాద్కు వచ్చిన విమానంలో ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడి వద్ద 248 గ్రాముల విదేశీ బంగారం లభించింది. దీంతో అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. దాని విలువ రూ.12.74 లక్షలు ఉంటుందని తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.
ఈ నెల 8న దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు 407 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. దాని విలువ రూ.20.25 లక్షలు ఉంటుందని చెప్పారు. బంగారాన్ని నల్లటి కార్బన్ పేపర్లో చుట్టి అక్రమంగా తరలిస్తున్నాడని అధికారులు వెల్లడించారు.