శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 3: బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి మలద్వారం ద్వారా అక్రమ రవాణాకు యత్నించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు.
దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి ఎయిర్ ఇంటలిజెన్స్, కస్టమ్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు. రూ.12,94,650 విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.