హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తె లంగాణ): ‘రాష్ట్రంలో నూనెగింజల సాగు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి వంగడాలనే రై తులకు అందుబాటులో ఉంచాలి’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మే 15 కల్లా కచ్చితమైన నివేదిక తెప్పించుకొని, జిల్లాలవారీగా వర్షపాతం అంచనాల ఆధారంగా రైతులు ఏయే పంటలు వేయాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాబోయే వర్షాకాలంలో ఎల్నినో ప్రభావమున్న నేపథ్యంలో సా గు ప్రణాళికలపై మంత్రి శనివారం ప్రత్యేకంగా సమీక్షించారు.
రాష్ట్రంలో కూరగాయలు, పప్పుధాన్యాలు, మిల్లెట్లు, నూనెగింజల సాగు విస్తీర్ణం గణనీయంగా త గ్గిందని, పెంచేలా సమగ్ర ప్రణాళిక రూ పొందించాలని అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులను సూచించారు. రైతు బహిరంగ మారెట్లో అమ్ముకున్నా మ ద్దతు ధర కంటే ఎకువ వచ్చే పంటరకాలను ఎంపిక చేయాలని సూచించారు. అందుకోసం రాష్ట్రస్థాయిలో మిల్లర్లతో, ఎఫ్సీఐ అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్య, ఐఎండీ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.