ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 28: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు (63) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఓయూ కామర్స్ విభాగంలో సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా సేవలందించి, 2019 జూన్లో ఉద్యోగ విరమణ చేశారు.
2020 ఆగస్టులో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ వీసీగా నియమితులయ్యారు. సిద్దిపేట జిల్లా తొగుట మం డలం వేములఘాట్కు చెందిన ఆయ న హెచ్వీగా సువరిచితుడు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఆయన భౌతికకాయానికి పలువురు అధ్యాపకులు నివాళులర్పించారు.