న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ-2023 పరీక్షను వచ్చే ఏడాది మే 7న నిర్వహించనున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. అలాగే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ (సీయూఈటీ)ని మే 21-31 వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది.