హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ మహేందర్రెడ్డితో పాటు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవిడ్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు అనుమతి ఇవ్వొద్దని సీఎస్ అధికారులను ఆదేశించారు.
రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సభలకు సైతం అనుమతి ఇవ్వొద్దన్నారు. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్లో మాస్క్, భౌతికదూరం తప్పనిసరి అమలు చేయాలని ఆదేశించారు. మాస్క్ ధరించేలా చూడడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో సిబ్బంది, విద్యార్థులు మాస్క్లు పెట్టుకునేలా చూడాలన్నారు. మాస్క్ లేకపోతే రూ.వెయ్యి జరిమానా కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.