హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్పై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్ ముదిరాజ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 19 వేలకుపైగా పోలీస్ ఖాళీలు ఉన్నాయని స్వయంగా డీజీపీ ప్రకటించినప్పటికీ, సీఎం రేవంత్రెడ్డి ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేవలం 7,437 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.
తక్షణమే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను వెనకి తీసుకోవాలని, కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులందరికీ నష్టం జరుగకుండా వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ వేంటనే విడుదల చేయాలని, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెడలు వంచైనా ఆ డిమాండ్లను నెరవేర్చుకుంటామని స్పష్టంచేశారు.