న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. ఆయన బ్రిక్స్ సమావేశాల్లో పాల్గోనున్నారు. ఇవాళ ప్రధాని మోదీతో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం అంశాల్లో చర్చలు జరగనున్నాయి. ఉన్నత స్థాయి బృందంతో పుతిన్ ఇండియాకు చేరుకున్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత.. బ్రిక్స్ సమావేశాల్లో పుతిన్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఢిల్లీ విమానాశ్రయంలో పుతిన్కు ఘనస్వాగతం లభించింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం అనే థీమ్తో బ్రిక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో 11 సభ్య దేశాలు ఉన్నాయి. ఫుడ్, ఎనర్జీ, హెల్త్, డిజాస్టర్ అంశాల్లో బ్రిక్స్ చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్-రష్యా వార్, పశ్చిమాసియా సంక్షోభం, హర్మూజ్ జలసంధి మూసివేత, ట్రంప్ వాణిజ్య సుంకాల నేపథ్యంలో బ్రిక్స్ సదస్సు జరగడం గమనార్హం. పుతిన్తో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దల్ ఫతాహ్ ఎల్ సిసి, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, అబూ దాబి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్, ఇథోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ, వియత్నాం ప్రధాని లీ మిన్ హుంగ్ కూడా బ్రిక్స్ సమావేశాలకు హాజరవుతున్నారు.