హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్కే భవన్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లపై చర్చించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ హాజరవుతున్నారని చెప్పారు. పరీక్ష సజావుగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రిలిమ్స్ పరీక్ష ఈ నెల 16న జరుగనున్న నేపథ్యంలో.. స్ట్రాంగ్ రూమ్లను గుర్తించి, పోలీసు రక్షణ ఏర్పాట్లుపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ పరీక్షల కోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్పై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.