రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లలతో బీఆర్కే భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారు. జి.ఓ.నెం.58 & 59 ధరఖాస్తుల ప్రాసెసింగ్, అన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల గ్రౌండింగ్, తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణముల నిర్మాణం, బహుళస్థాయి అవెన్యూ ప్లాంటేషన్లు మరియు బ్లాక్ ప్లాంటేషన్లు, వరి సేకరణ, దళిత బంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటివల కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల CIG శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనీల్ కుమార్ , ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్ , మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ యన్.సత్యనారాయణ, అటవీ శాఖ పిసిసిఎఫ్ డోబ్రియల్ , TSIIC MD నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.