హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): పచ్చదనం పెంచేలానే కాకుండా పంచాయతీలకు ఫలసాయంతో ఆదాయం వచ్చే లా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. మైక్రోలెవల్ ప్లానింగ్తో బ్లాక్ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు. బుధవారం బీఆర్కేఆర్ భవన్లో నీటిపారుదల భూముల్లో ప్లాంటేషన్ అంశంపై వివిధ జిల్లాల అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో పచ్చదనం కూ డా 7.7% పెరిగిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గతేడాది నుంచి సాగునీటి పారుదలశాఖ భూముల్లో తోటల పెంపకం చేపట్టేందుకు ఉన్న అనుకూల పరిస్థితులు, సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి జిల్లాస్థాయి బృందాలు కొన్ని స్థలాల ను పరిశీలించాయని వెల్లడించారు.
ఎనిమిది జిల్లాల బృం దాలు బ్లాక్, లీ నియర్ ప్లాంటేషన్లను చేపట్టేందుకు డ్రా ఫ్ట్ మోడల్ యాక్షన్ ప్లా న్ను సూచించగా, దానిని వర్ షాప్లో ప్రదర్శించారు. వర్క్షాప్లో సాగునీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ హనుమంతరావు, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, మహబూబ్నగర్, మెదక్, నాగర్కర్నూల్, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా అటవీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.