హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల 2 నుంచి 22 వరకు జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉత్సవాల ప్రారంభోత్సవ నిర్వహణపై ఆమె బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయం ప్రారంభ అనంతరం భవనం ఆవరణలో తొలిసారిగా జరుగుతున్న వేడుకలను వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఉత్సవాలు జరిగే 21 రోజులపాటు నగరంలోని సచివాలయం, రాజ్భవన్, అసెంబ్లీ లాంటి ప్రముఖ భవనాలను, చార్మినార్, క్లాక్టవర్ వంటి పర్యాటక కట్టడాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని ఆదేశించారు. గన్పార్లోని అమరవీరుల స్థూపాన్ని పూలతో అలంకరించాలని, సమావేశ ప్రాంగణంలో ఎల్ఈడీ స్రీన్లు, పీఏ సిస్టం తదితర ఏర్పాట్లను చేపట్టాలని సమాచార, పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ను ఆదేశించారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్ కుమార్, సునీల్శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ప్రభుత్వ కార్యదర్శులు రాహుల్ బొజ్జా, శ్రీనివాసరాజు, సందీప్కుమార్ సుల్తానియా, ఎస్ఏఎం రిజ్వీ తదితరులు హాజరయ్యారు.