హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని సూచించే అధికారిక సంక్షిప్త నామాన్ని ప్రభుత్వం ‘టీజీ’గా మారుస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాలని సూచించారు.
జీవోలు, పాలసీ పేపర్లు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, లెటర్ హెడ్స్, అధికారిక పత్రాల్లో టీజీ వచ్చేలా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే టీఎస్ పేరుతో ముద్రించిన పత్రాలను ఏం చేయాలనే దానిపై ఈ నెలాఖరుకు నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు.