(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రష్యా నుంచి అత్యంత చవగ్గా చమురును దిగుమతి చేసుకొంటున్నప్పటికీ, పెట్రో రేట్లను కేంద్రం సవరించటం లేదు. బ్యారెల్కు 68.17 డాలర్ల (రవాణా ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి) వద్ద రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నది. బయటి విపణిలో ప్రస్తుతం 85 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురుతో పోలిస్తే రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు చవగ్గా లభించినట్టు అర్థమవుతున్నది. ఇంత తక్కువ ధరకు ముడిచమురును కొనుగోలు చేసినప్పటికీ, పెట్రో ధరలు తగ్గకపోవటంతో వాహన దారులపై భారం పడుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.