ఇటిక్యాల, జనవరి 8 : దేశ రాజకీయాల్లో మార్పు కోసం, బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో అఖండ విజయం సాధించి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ సీఆర్పీఎఫ్ రిటైర్డ్ జవాన్ ఆనంద్ పాదయాత్ర చేపట్టాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామానికి చెందిన ఈయనకు సీఎం కేసీఆర్ అంటే ఎంతో అభిమానం.
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ రాణించాలని కోరుతూ సొంతూరైన వేముల గ్రామం నుంచి హైదరాబాద్లోని ప్రగతిభవన్ వరకు ఆదివారం ఆయన పాదయాత్ర ప్రారంభించాడు. దాదాపు 200 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టనున్నాడు. ఆనంద్ చేపట్టిన యాత్ర విజయవంతం కావాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆకాంక్షించారు.