హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): గత బుధవారం నుంచి ఈ నెల 22 వరకు తిరుమల శ్రీవారిని సుమారు 5 కోట్ల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. వారం రోజులుగా నిత్యం 80 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు, లోక్సభ ఎన్నికలు ముగిసిన కారణంగా ఈ వారం భక్తుల తాకిడి పెరిగింది. వివిధ
ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న భక్తులతో కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు నిండిపోతున్నాయి. ఏటీసీ గెస్ట్హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. బుధవారం స్వామివారిని 80,048 మంది భక్తులు దర్శించుకోగా 35,403 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.17 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.