యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి(Lakshmi Narasimhaswamy) ఆలయానికి భక్తులు( Devotees) పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటం, శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహస్వామి దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
ధర్మదర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది. కొండపైన ఉన్న బస్ బే, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతున్నది. స్వామి అమ్మవారికి నిత్య పూజలు శాస్త్రంగా కొనసాగుతున్నాయి తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారికి నిత్య ఉత్సవాలు చేపట్టారు.