యాదగిరిగుట్ట, డిసెంబర్17 : యాదగిరిగుట్ట(Yadagirigutta )శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో భక్తుల(Devotees) సందడి నెలకొంది. ధనుర్మాసోత్సవాలు ప్రారంభంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఎటు చూసిన భక్తులే దర్శనమిచ్చారు. ఆలయ మాడవీధులు, ప్రసాద విక్రయశాలలు, పార్కింగ్, క్యూలైన్ లలో భక్తులే దర్శనమిచ్చారు. ఉదయం బ్రేక్ దర్శనంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది.