యాదగిరిగుట్ట, జూలై 23: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 22 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.28,00,324 ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు.