రాజన్న సిరిసిల్ల : వేములవాడ(Vemulawada) పట్టణం శివ నామస్మరణతో మార్మోగుతున్నది. మహా శివరాత్రి(Maha Shivratri) పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దసంఖ్యలో భక్తులు(Devotees) తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్బంగా వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఆవరణలో భక్తులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాట్లాడారు.
పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు పరిశీలించి, నిర్వాహకులు, వాలంటీర్లను విప్ అభినందించారు. అనంతరం స్వామి వారిని విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలయ ఆవరణలో పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు చేశారు.