హైదరాబాద్ : పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు(Kondagattu) భక్తుల(Devotees )తో కిటకిటలాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చిన అంజన్న భక్తులతో కొండగట్టు గుట్ట జై హనుమాన్ నినాదాలతో హోరెత్తుతోంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.