హైదరాబాద్ : వేములవాడ(Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాని(Rajanna Temple)కి సోమవారం భక్తులు(Devotees) పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. సమ్మక్క, సారలమ్మ భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. మేడారం వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ క్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారమే వేములవాడ చేరుకున్న భక్తులు సోమవారం ఉదయాన్నే ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ధర్మగుండంలో స్నానం ఆచరించి ప్రత్యేక క్యూలెన్ద్వారా స్వామివార్లను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా, స్వామి వారి దర్శనానికి నాలుగు గంటలు సమయం పట్టే అవకాశం ఉంది.