హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : కోటి రూపాయల ప్రమాద బీమా సింగరేణి కార్మికుల్లో వెలుగులు నింపుతున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు 45 కుటుంబాలను ఆదుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు సంస్థ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్షిక, శాశ్వత వైకల్యానికి కోటి రూపాయల బీమా అందజేస్తున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి.
సహజ మరణానికి రూ.10-15 లక్షల బీమా అమలుచేస్తున్నట్టు వెల్లడించాయి. అంతేకాకుండా నామమాత్రపు ప్రీమియంతో రూ.50 లక్షల ఆరోగ్య బీమా పథకానికి సైతం శ్రీకారం చుట్టినట్టు సంస్థ ప్రకటించింది.